కొద్దికాలం గా ఇండస్ట్రీలో వరుస విషాదాలు సినీ ప్రేక్షకులను అభిమానులను కలవర పెడుతున్నాయి. ఇటీవల సినీ ప్రముఖులు మరణాలను, మరవకముందే తాజాగా బుల్లితెర నైటీ వైశాలి మృతి చెందిన వార్తఅందరిని విషాదంలో ముంచెత్తింది. ఇండోర్ కు చెందిన ఈ బ్యూటీ తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన, ఒక్కసారిగా టీవీ పరిశ్రమని షాక్ కి గురిచేసింది. అయితే ఇండోర్లోని తేతేజి నగర్ పోలీసులు వైశాలి మరణం పై కేసు నమోదు చేశారు.సుజరల్ సిమర్కా సీరియల్ ద్వారా మంచి గుర్తింపు దక్కించుకున్న వైశాలి, ఏడాది నుండి ఇండోర్లో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మధ్యనే సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న వైశాలి, 29 ఏళ్లకే అనుమానాధాస్పద స్థితిలో మరణించడం, ఇండస్ట్రీలో చర్చనియాంశంగా మారింది.